వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జమ్మూలో 19 మంది పోలీసుల మృతి
జమ్మూ: జమ్మూలోని రాజౌరీజిల్లాలో మిలిటెంట్లు శుక్రవారం సాయంత్రం 19మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. మరోఇద్దరు పోలీసులు గల్లంతయ్యారు. జిల్లాలోని గంభీర్ గ్రామంనుంచి రాజౌరీ పట్టణానికి తిరిగి వస్తున్న పోలీసుబృందంపై మిలిటెంట్లు దాడి చేశారు. కొండలమీంచి, గుట్టల మీంచి వీరిపైకి రాకెట్లు ప్రయోగించారు. బుల్లెట్లుకురిపించారు. దీంతో పోలీసులు ప్రయాణిస్తున్నవాహనం తుక్కుతుక్కయింది. పది మంది పోలీసులు అక్కడికక్కడేమరణించారు. తొమ్మిది మంది ఆస్పత్రిలో మృతిచెందారు.
కొత్తగా ఎన్నికయిన పంచాయతీ సభ్యుడ్ని,మరో ప్రభుత్వోద్యోగిని తీవ్రవాదులు హతమార్చినసంఘటనపై విచారణ జరపడానికి గంభీర్ గ్రామంవెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటనజరిగింది.
Comments
Story first published: Wednesday, March 14, 2001, 23:53 [IST]