వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయానికి కరెంట్‌సబ్సిడీ రద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వ్యవసాయానికివిద్యుత్‌ సబ్సిడీ ఎత్తేయాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి రాష్ట్రాలకు సూచించారు. విద్యుత్‌రంగంలో సంస్కరణలపై శనివారం ఏర్పాటయిన ముఖ్యమంత్రుల, రాష్ట్రాలవిద్యుచ్ఛక్తి మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వ్యవసాయానికి సరఫరా చేసేవిద్యుత్తుపై ఛార్జీలు పెంచాలని కూడా ఆయనసూచించారు. దీన్ని రైతులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లుఆయన తెలిపారు. విద్యుచ్ఛక్తి బోర్డులకుఆదాయం పెంచితే రైతులు అదనపు సేవలుపొందుతారని ఆయన అన్నారు.విద్యుత్‌ వినియోగించుకునే వారే దానికయ్యే ఖర్చు భరించాలనే సింపుల్‌ వాణిజ్య సూత్రాన్ని అమలు చేయకపోవడం వల్లనే ఈ రోజు దేశంలోని అన్ని రాష్ట్రాలవిద్యత్‌ బోర్డులు నష్టాల్లో కూరుకుపోయాయని ఆయన చెప్పారు.

వ్యవసాయం పేరిట అనేక మంది ఉచితంగా లేదంటే భారీ సబ్సిడీతోవిద్యుత్‌ను పొందుతున్నారని ఆయన విమర్శించారు. దేశంలో పంపిణీ అవుతున్నవిద్యుత్‌లో కేవలం 40 శాతం మాత్రమే బిల్‌ అవుతున్నదని బిల్లులు పంపిస్తున్నవారందరూ కూడా కట్టడంలేదని ప్రధానివిమర్శించారు. ఇలాంటి స్థితిలో విద్యుత్‌ రంగంలో మనుగడ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.విద్యుత్‌ బోర్డుల నష్టం ఏటా 24924 కోట్ల రూపాయలు వుంటున్నదని ఆయనపేర్కొన్నారు.

పెరుగుతున్న అవసరాలను తట్టుకోవాలంటే రానున్న పదేళ్ల కాలంలో భారత్‌ అదనంగా కనీసం 1000 మొగావాట్లవిద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని సమకూర్చుకోవల్సివున్నదని ఆయన చెప్పారు. ఇందుకు కనీసం 8 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవసరమవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్‌బడ్జెట్‌ సమావేశంలోనే ప్రభుత్వం ఒక సమగ్రమైనవిద్యుత్‌ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా ఆయన చెప్పారు.విద్యుత్‌ సంస్కరణల విషయంలో ముందంజలో వున్నఒరిస్సా ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అదే విధంగా హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, రాజస్తాన్‌ రాష్ట్రప్రభుత్వాలను కూడా ఆయన ప్రశంసించారు.

ఆర్థికంగా ఆదుకోండిఃరాష్ట్రాల వినతి
విద్యుత్‌ సంస్కరణల అమలుకు తమ వద్దనిధులు లేవని, ఆర్థిక సాయం అందించికేంద్రం రాష్ట్రాలను ఆదుకోవాలని వివిధ రాష్ట్రప్రభుత్వాలు కోరాయి. విద్యుత్‌ బోర్డులు పీలకలోతు అప్పులలో కూరుకపోయాయని, వీటిని అప్పుల ఊబినుంచి బయటకు లాగినప్పుడే సంస్కరణఅమలు సాధ్యం అదువుతుందని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. వివిధ రాష్ట్రప్రభుత్వాల విద్యుత్‌ బోర్టుల బకాయలను పరిశీలించి ఒకనిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రిసురేష్‌ ప్రభు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X