వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెన్సెక్స్‌97 పాయింట్ల పతనం

By Staff
|
Google Oneindia TeluguNews

బేర్‌ ఆపరేటర్స్‌ కార్టెల్‌గా ఏర్పడి సాగించినట్టుగా చెబుతున్న లావాదేవీలపై దర్యాప్తునకు సెబి ఆదేశించడం మార్కెట్‌లో సోమవారం నాడు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటినుంచి మార్కెట్‌లో భయోత్పాత వాతావరణం కనిపించింది.

గ్లోబల్‌, హిమాచల్‌, జీ టెలీ, సిల్వర్‌లైన్‌, ఎస్‌ఎస్‌ఐ, డిఎస్‌క్యూ సాఫ్ట్‌వేర్‌ 16 శాతం కనిష్టస్థాయిని తాకాయి.సత్యం, డిజిటల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ కూడా నష్టాలతో ముగిసాయి.పాత షేర్లలో ఎసిసి, టాటా పవర్‌, బిఎస్‌ఇఎస్‌, అశోక్‌ లేలాండ్‌ గణనీయంగా తగ్గాయి. సెన్సెక్స్‌ 97 పాయింట్ల నష్టంతో 3997 వద్ద క్లోజయింది. కాగా నేషనల్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ ఇండెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 1277 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఒక దశలో 3947 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకి మార్కెట్‌ వర్గాల్లో భయోత్పాతం సృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X