వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలుషిత నీటితో 200 మందికిఅస్వస్థత

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం పట్టణంలో కలుషిత మంచినీరు తాగి 200 మంది అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన మంచినీటి కొరత ఎదుర్కుంటున్న అనంతపురం పట్టణంలో మూడురోజులకోసారి మంచినీరును మున్సిపాల్టీ శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు. ఈ నీటినే ప్రజలు నిల్వచేసి ఉపయోగిస్తున్నారు.

శనివారం నాడు సప్లయ్‌ చేసిన నీరు కలుషితమైనది కావడంతో ప్రజలు అస్వస్థులైనట్టుగా తెలుస్తున్నది. ఈ విషయం మున్సిపల్‌ అధికారులు కూడా అంగీకరించారు. టెలీఫోన్‌ శాఖ కేబుల్స్‌ వేసేందుకు ప్రారంభించిన తవ్వకాల వల్ల వాటర్‌పైప్‌ పగిలిపోయి అందులోకి డ్రైనేజీ వాటర్‌ ప్రవేశించివుండవచ్చని వారు అంటున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వైద్య శాఖ కూడా బాధితులకు తగిన వైద్య చికిత్స అందజేసేందుకు
ఏర్పాట్లను చేస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X