పొత్తుకు మెట్టుదిగిన జయ
చెన్నై: వచ్చే శాసనసభఎన్నికల్లో తమిళ మనీలా కాంగ్రెస్ (టిఎంసి),కాంగ్రెస్ కూటమితో పొత్తుకు అన్నాడియంకె ప్రధానకార్యదర్శి జయలలిత ఒక మెట్టు దిగి వచ్చారు.టిఎంసి, కాంగ్రెస్ కూటమికి 45 సీట్లు ఇవ్వడానికే కాకుండా తమనేతృత్వంలోని ఫ్రంట్లో చేరితే పాండిచ్చేరీలోరెండున్నర ఏళ్ల పాలనను ఆ కూటమికి ఇస్తామని ఆమెచెప్పారు.
టిఎంసి, కాంగ్రెస్ కూటమితో పొత్తుకుఅవకాశాలు ఇక లేనట్లేనని వచ్చిన వార్తలను ఆమె క్రిక్కిరిసినవిలేకరుల సమావేశంలో ఖండించారు. పొత్తుపై టిఎంసి అధ్యక్షుడుజి.కె. ముపనార్తో తాను ఇంకా మాట్లాడుతూనేవున్నానని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ కోరుకుంటేతమిళనాడులో కుదిరే పొత్తుకు పాండిచ్చేరీని ముడి పెట్టకుండా వుండడానికి కూడాతాను సిద్ధమేనని ఆమె చెప్పారు.
ఇదిలా వుంటే, జయలలితతాజా ప్రతిపాదనపై కాంగ్రెస్ ఇప్పటి వరకుప్రతిస్పందించలేదు. తమ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నట్లుకాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్న్యూఢిల్లీలో అన్నారు. తాము మూడో ఫ్రంట్ ఏర్పాటుకుసిద్ధపడతామని కూడా ఆయన చెప్పారు.