వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నయ్‌లో తెలుగుభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః తమిళనాడు లోని తెలుగు సంఘాల వారు రణభేరి మోగించాయి. తమిళనాడులోని మొత్తం 34 తెలుగుసంఘాలు సోమవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు మహానాడు నిర్వహించాయి. తమిళనాడులో తెలుగువారి హక్కులు, భాషాపరమైన సమస్యలపై ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించారు.

తమిళనాడులోని తెలుగువారి సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వానికే వచ్చేఅసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని సంఘాల నేతలు మహానాడులో ప్రకటించాయి. తమిళనాడులోని తెలుగువారి హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని ఆ సంఘాలు ముక్త కంఠంతో నినదించాయి.

ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు వేగుస్వామి నాయుడుతో పాటు పలువురు తెలుగు సంఘాల ప్రముఖులు ఈ మహానాడులో పాల్గొన్నారు. తమిళనాడులో తెలుగువారి హక్కులకు భద్రత లేకుండా పోయిందని, తమ పట్ల శ్రద్ధ వహించే ప్రభుత్వానికే పట్టం కడతామని వారు స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X