వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చెన్నయ్లో తెలుగుభేరి
చెన్నయ్ః తమిళనాడు లోని తెలుగు సంఘాల వారు రణభేరి మోగించాయి. తమిళనాడులోని మొత్తం 34 తెలుగుసంఘాలు సోమవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు మహానాడు నిర్వహించాయి. తమిళనాడులో తెలుగువారి హక్కులు, భాషాపరమైన సమస్యలపై ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించారు.
తమిళనాడులోని తెలుగువారి సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వానికే వచ్చేఅసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని సంఘాల నేతలు మహానాడులో ప్రకటించాయి. తమిళనాడులోని తెలుగువారి హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని ఆ సంఘాలు ముక్త కంఠంతో నినదించాయి.
ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు వేగుస్వామి నాయుడుతో పాటు పలువురు తెలుగు సంఘాల ప్రముఖులు ఈ మహానాడులో పాల్గొన్నారు. తమిళనాడులో తెలుగువారి హక్కులకు భద్రత లేకుండా పోయిందని, తమ పట్ల శ్రద్ధ వహించే ప్రభుత్వానికే పట్టం కడతామని వారు స్పష్టం చేశారు.
Comments
Story first published: Tuesday, March 6, 2001, 23:53 [IST]