వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల్కో పై కాగ్‌ దర్యాప్తు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాల్కో లో 51 శాతం వాటాను స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌కు విక్రయించిన వ్యవహారంపై దర్యాప్తు జరపాల్సిందిగా కంఎ్టో్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ను కేంద్ర డిజ్‌ఇన్‌వెస్ట్‌మెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్‌శౌరి కోరారు.

ఈ లావాదేవీకి సంబంధించిన పత్రాలన్నింటిని ప్రభుత్వం అందజేయడానికి సిద్ధంగా వున్నదని ఆయన చెప్పారు. బాల్కోలో వాటాలఉపసంహరణ వ్యవహారంలో అవినీతి చోటుచేసుకున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నందున ఈ వ్యవహారంపై కాగ్‌ దర్యాప్తునకు శౌరీ స్వయంగా విజ్ఞప్తిచేశారు.

అజిత్‌ జోగిపై బిజెపి ఆగ్రహం
బాల్కో ప్రైవైటీ కరణపై మొండివైఖరి అవలంబిస్తున్న అజిత్‌ జోగిపై బిజెపి బుధవారం మండిపడింది. అజిత్‌ జోగి ఛత్తీస్‌ ఘడ్‌ ముఖ్యమంత్రిగా కాకుండా కార్మిక నాయకుడిలాగా వ్యవహరిస్తున్నాడని బిజెపి ప్రతినిధి మల్హోత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌ ఘడ్‌ అజిత్‌ జోగి సొంత సొత్తు కాదని, బాల్కొలో రోజూ వచ్చే నష్టాన్ని ఛత్తీస్‌ ఘడ్‌ ముక్కుపిండి వసూలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X