జయ భిక్ష పైకాంగ్రెస్ పెదవివిరుపు Home Full Story
న్యూఢిల్లీః తమిళనాడుఅసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్-జయలలిత మధ్య జరుగుతున్నసీట్ల బేరాలు ఆసక్తికరంగా మారాయి. ఎఐఎడిఎంకె అధినేత్రిజయలలిత టిఎంసి, కాంగ్రెస్ పార్టీలకు కలిపి 45సీట్లు ఇవ్వజూపడం పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తివ్యక్తం చేసింది. జయ పంపకాలపై రెండు రోజుల పాటుమౌనం పాటించిన కాంగ్రెస్ బుధవారం నోరువిప్పింది. కేవలం 45 స్థానాలుఇవ్వాలనే జయలలిత ప్రతిపాదన పట్లకాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిఎస్. జైపాల్ రెడ్డి బుధవారం కొత్తఢిల్లీలోవిలేకరులతో మాట్లాడారు. జయలలిత ప్రకటించిన 45 స్థానాలు సరిపోవనిఆయన కరాఖండిగా చెప్పారు. మరిన్ని స్థానాల కోసంజయలలితతో చర్చలు జరుపుతున్నామనిఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున టిఎంసి నేతలుజయలలితతో చర్చలు జరుపుతున్నారని ఆయనచెప్పారు. సీట్ల పంపిణీ వ్యవహారం సామరస్యంగా పరిష్కారం అవుతుందనిజైపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
- పొత్తుకుమెట్టు
దిగిన
జయ