కిన్నెరసానిపై కాంగ్రెస్ రణభేరి
కొత్తగూడంః ఖమ్మం జిల్లా లోని గిరిజన రైతులనోళ్ళు కొడుతున్నారంటూ కాంగ్రెస్ రణభేరిమోగించింది. ఖమ్మం జిల్లాలో వున్న గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న 10వేల ఎకరాలు ఎండిపోతుంటే ప్రభుత్వం కిన్నెరసాని ప్రాజెక్టునీటిని గోదావరి జిల్లాల రైతులకు సరఫరాచేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలు మండి పడ్డారు. 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలు బుధవారంపాల్వంచ లోని కెటిపిఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈధర్నా కార్యక్రమంలో వామపక్షాలకు చెందిననాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.
ఇచ్చంపల్లి ప్రాజెక్టు వద్దకుపాదయాత్ర నిర్వహించిన తీరులో 20 మందికాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలు బుధవారం కిన్నెరసాని ప్రాజెక్టువిషయంపై పాల్వంచలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం తెలంగాణాపై సవతితల్లి ప్రేమ చూపుతున్నదనివారు దుయ్యబట్టారు. కెటిపిఎస్ కు నీరు సక్రమంగా సరఫరాకాదనే సాకుతో కిన్నెర సాని నీటిని గిరిజన రైతులు భూములకుఇవ్వకుండా గోదావరి జిల్లాలకు తరలిస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్ల్యేవనమా వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, వామపక్షాల నేతలధర్నాతో పాల్వంచ కోలాహలంగా కనిపించింది. తెలంగాణా జిల్లాలకుఅన్యాయం చేస్తే సహించేది లేదని ధర్నాసందర్భంగా ప్రసంగించిన వక్తలు హెచ్చరించారు.