వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌ ఎన్నికలకు మమత దూరం

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌ కతాః పశ్చిమ బెంగాల్‌ లో త్వరలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలకు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం జరుగుతున్న మమతా బెనర్జీ దూరంగా వుంటున్నారు. ఈవిషయాన్ని మమతా బెనర్జీ బుధవారం ప్రకటించి సంచలనం సృష్టించారు. మొత్తం 294అసెంబ్లీ స్థానాలకు గాను 235 స్థానాలలో తృణమూల్‌ అభ్యర్థులు పోటీ చేస్తారు. మిత్రపక్షమైన బిజెపికి మమత 39సీట్లు కేటాయించారు. ఇతర పార్టీలకు 16 సీట్లు కేటాయించారు. గిరిజన ప్రాంతాలలో స్థానిక పార్టీలకు తృణమూల్‌ మద్దతు ప్రకటించింది.

ఎన్నికల బరికి దూరంగా వుంటున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ బెంగాల్‌ కు కాబోయే ముఖ్యమంత్రి అనిసర్వత్రా ప్రచారం జరుగుతున్న తరణంలో ఆమె నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 228 మంది తృణమూల్‌ అభ్యర్థుల జాబితాను మమత బుధవారం ప్రకటించారు. మరో ఏడుగురి జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆమె చెప్పారు.

బుద్ధదేవ్‌ తో సినీస్టార్‌ డీ
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధ దేవ్‌ భట్టాచార్యపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ బెంగాలీ నటి మాధురీ ముఖర్జీ పోటీ చేస్తారు. ఈవిషయాన్ని మమతా బెనర్జీ వెల్లడించారు. బెంగాల్‌ ప్రజల్లో మంచి ఆదరణ వున్న మాధురి బుద్ధదేవ్‌ ను ఏ మాత్రం నిలువరిస్తారో వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్‌ మీనమేషాలు
అటు వామపక్షాలు, ఇటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహాల్లో తలమునకలుగా వుండగా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎటూ పాలుపోక దిక్కులు చూస్తున్నది. పిడిఎం తో పొత్తు కుదుర్చుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నది. భావసారూప్యత గల పార్టీలను కలుపుకొనిసెక్యులర్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌సీనియర్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం కోల్‌ కతాలో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X