వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠశాలలో పేలుడు: 41 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: తూర్పు చైనాలోని ఒక పాఠశాలలో జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో 41 మంది చిన్నారి విద్యార్ధులు మరణించారు. పాఠశాల ఆవరణలోనే అక్రమంగా నిల్వచేసిన టపాసులు ఈ పేలుడుకు కారణమని తెలుస్తున్నది. జియాంగ్సీ రాష్ట్రంలోని వాంజైలో వున్న రెండతస్తుల ప్రాధమిక పాఠశాల భవనం ఈ పేలుడు తాకిడికి కుప్పకూలిపోయినట్టుగా అధికారవర్గాలు చెప్పాయి.

పేలుడుకు కారణం తెలియదని అధికార వర్గాలు చెబుతున్నా, అక్రమంగా నిల్వచేసిన టపాసులు ఈ దుర్ఘటనకు కారణమని హంగ్‌కాంగ్‌కు చెందిన ఒక వార్తాసంస్థ వెల్లడించింది. స్థానికుల్లో కూడా దీనికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా చైనాలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వేతనాలు సరిగ్గా అందడం లేదని దాంతో టాపాసుల తయారీ అమ్మకం వంటి వ్యాపకాలను వారు పాఠశాలల్లోనే నిర్వహిస్తున్నారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X