వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాఠశాలలో పేలుడు: 41 మంది మృతి
బీజింగ్: తూర్పు చైనాలోని ఒక పాఠశాలలో జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో 41 మంది చిన్నారి విద్యార్ధులు మరణించారు. పాఠశాల ఆవరణలోనే అక్రమంగా నిల్వచేసిన టపాసులు ఈ పేలుడుకు కారణమని తెలుస్తున్నది. జియాంగ్సీ రాష్ట్రంలోని వాంజైలో వున్న రెండతస్తుల ప్రాధమిక పాఠశాల భవనం ఈ పేలుడు తాకిడికి కుప్పకూలిపోయినట్టుగా అధికారవర్గాలు చెప్పాయి.
పేలుడుకు కారణం తెలియదని అధికార వర్గాలు చెబుతున్నా, అక్రమంగా నిల్వచేసిన టపాసులు ఈ దుర్ఘటనకు కారణమని హంగ్కాంగ్కు చెందిన ఒక వార్తాసంస్థ వెల్లడించింది. స్థానికుల్లో కూడా దీనికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా చైనాలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వేతనాలు సరిగ్గా అందడం లేదని దాంతో టాపాసుల తయారీ అమ్మకం వంటి వ్యాపకాలను వారు పాఠశాలల్లోనే నిర్వహిస్తున్నారని అంటున్నారు.
Story first published: Wednesday, March 7, 2001, 23:53 [IST]