షార్జా టోర్నీ కోసం భారత్ లో బుఖాతిర్
న్యూఢిల్లీః షార్జాలో క్రికెట్ టోర్నమెంట్ లునిర్వహించే అబ్దుల్ బుఖాతిర్ భారత్ లోవున్నట్లు సమాచారం అందింది. రెండేళ్ళుగా భారత్ -పాకిస్తాన్ లు షార్జా గడ్డపై మ్యాచ్ లు ఆడని విషయంవిదితమే. పాకిస్తాన్ తో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో చివరకు షార్జామ్యాచ్ లు కూడా జరగకుండా పోతున్నాయి. దీనితో షార్జామ్యాచ్ లలో భారత్ పాల్గొనేలా వాజ్ పేయిప్రభుత్వాన్ని ఒప్పించేందుకు బుఖాతిర్ ఢిల్లీవచ్చినట్లు తెలిసింది.
ఢిల్లీ వచ్చిన బుఖాతిర్కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఉమాభారతినికలుసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే బుఖాతిర్ను కలుసుకొనేందుకు ఉమాభారతి అనుమతిఇవ్వలేదని తెలిసింది. షార్జా టోర్నమెంట్ లోమాఫియా నిధులు ప్రవహిస్తున్నాయని,సరిహద్దులో పాకిస్తాన్ భారత్ పై కత్తులుదూస్తుంటే వాళ్ళతో క్రికెట్ ఆడడం అర్ధరహితం అనేఉద్దేశంతో భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ తో క్రికెట్ఆడేందుకు అనుమతి నిరాకరిస్తున్న విషయం విదితమే.
అయితే షార్జాలో టోర్నమెంట్నిర్వహణకు మాఫియా గ్యాంగ్ లకు సంబంధంలేదని, క్రీడా స్పూర్తితో భారత్-పాక్ మ్యాచ్ లునిర్వహించేందుకు అనుమతించాలని బుఖాతిర్ఢిల్లీని ఒప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.