ఆంధ్ర మహిళలకు ఐటివెలుగులుః బాబు
హైదరాబాద్ః మహిళలకుఅగ్రతాంబూలం ఇవ్వాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐటిరంగంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రతికుటుంబంలో ఒక మహిళకు డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం కల్పిస్తున్నామనిమహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకకార్యక్రమంలో చంద్రబాబు ప్రకటించారు.
మహిళలనుసామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ముందుకుతీసుకువెళ్ళేందుకు గాను వచ్చే నాలుగేళ్ళలో 3,350 కోట్లురూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చంద్రబాబు సభికుల హర్షధ్వానాల మధ్యప్రకటించారు. మహిళలు మగవారికి దీటుగా అభివృద్ధిసాధిస్తేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందనిఆయన చెప్పారు.
రాజకీయాలలో సైతం మహిళలకుతెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యతఇస్తున్నదని ఆయన చెప్పారు. ఆంధ్రకు చెందినమహిళలు ఇప్పటికే ఎంతగానో అభివృద్ధిసాధించారని ఆయన చెప్పారు. మహిళలందరికీ కంప్యూటర్విద్య అందించాలన్నదే తన సంకల్పమనిఆయన చెప్పారు.
మహిళలకు
చట్టసభల్లో
33
శాతంరిజర్వేషన్లు
కల్పించే
మహిళా
రిజర్వేషన్
బిల్లును
ఆలస్యంచేయకుండా
ఈ
సమావేశాల్లోనే
ఆమోదించాలనిఆయన
కోరారు.
ఈ
మేరకు
కేంద్రంపై
ఒత్తిడి
తెస్తామనిఆయన
చెప్పారు.