బాల్కోలో కొనసాగుతున్న సమ్మె
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత్ అల్యూమినియం కంపెనీ కార్మికులు సాగిస్తున్న సమ్మె శుక్రవారం ఏడో రోజు కూడా విజయవంతంగా సాగింది. విధులకు హాజరుకాదల్చిన కార్మికులకు రక్షణ కల్పించాల్సిందిగా సుప్రీం కోర్టు చత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ, కార్మికులు స్వచ్ఛందంగా విధులకు వెళ్లడం లేదు.
గత
రెండు
మూడురోజుల్లో
విధులకు
హాజరయ్యేందుకు
ప్రయత్నించిన
కార్మికులపై
సమ్మె
జరుపుతున్న
కార్మికులు
దాడిచేయడం,
వారిని
వివస్త్రులుగా
చేసి
ఊరేగించడం
వంటి
సంఘటనలతో
విధులకు
హాజరుకావడానికి
సిద్ధంగా
వున్నవారు
బెదిరిపోయారు.
ఇదిలా
వుండగా
చత్తీస్గఢ్
ముఖ్యమంత్రి
అజిత్జోగీ
ఇచ్చిన
హామీ
వల్ల
గురువారం
నాడు
స్టెరిలైట్
ప్రతినిధి
కొత్త
జనరల్
మానేజర్
కృష్ణన్
బాల్కోలో
పోలీసుల
సాయంతో
అడుగుపెట్టారు.
కార్మికులు
సమ్మె
విరమించి
తమకు
సహకరించాలని
కొత్త
యాజమాన్యం
కోరింది.
అయితే
కార్మికులు
మాత్రం
తమ
డిమాండ్లను
సాధించుకునే
వరకు
సమ్మె
విరమించేది
లేదని
అంటున్నారు.