వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హోలీ వేడుకల్లో విషాదం
హైదరాబాద్: శుక్రవారం నాడు రాష్ట్రంలో జరిగిన హోలీ వేడుకల్లో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. హోలీ అనంతరం స్నానాలకని వెళ్లిన యువకులు దుర్మరణం పాలైన సంఘటనలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో జరిగాయి.
హైదరాబాద్లో శేరిలింగంపల్లిలో ఒకరు, కాప్రాలో మరొకరు స్నానాలకని వెళ్లి మృత్యువు వాతపడ్డారు. కాగా వరంగల్ జిల్లాలో ఇద్దరు యువకులు కాకతీయ కాలువలో స్నానానికని వెళ్లి మునిగిపోయారు. కరీంనగర్ జిల్లాలో మరో ఇద్దరు విద్యార్ధులు కూడా చెరువులో స్నానానికని వెళ్లి దుర్మరణం పాలయ్యారు.
Comments
Story first published: Saturday, March 10, 2001, 23:53 [IST]