వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుర్గిలో ఏడుగురు కాంగ్రెస్‌ కార్యకర్తలహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: పడగ విప్పిన ముఠాకక్షలకు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరు వద్ద శనివారం ఏడుగురు బలయ్యారు. మాచర్ల సమీపంలోని దుర్గిలో కోర్టుకు వెళుతున్న 11 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు దాడి చేసి నరమేధం సృష్టించారు. నలుగురిని గొడ్డళ్ళతో నరికి కిరాతకంగా చంపారు. మరో ముగ్గురిని వేటకొడవళ్ళతో వేటాడి వధించారు. మరో నలుగురు కాంగ్రెస్‌ కార్యకర్తలు మాచర్ల ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

జిల్లా కేంద్రమైన గుంటూరుకు 120 కిలోమీటర్ల దూరంలోని దుర్గి పట్టణంలోని పోలీస్టేషన్‌ సమీపంలో ఈ దారుణ కాండ జరగడం విశేషం. షరతులతో కూడిన బెయిలుపై వున్న లక్ష్మారెడ్డి వర్గానికి చెందిన సమ్మిరెడ్డితో పాటు ఆరుగురు సంతకం చేసేందుకు జీపులో పోలీసు స్టేషన్‌కు వెళ్తుండా ప్రత్యర్థి వర్గానికి చెందిన దాదాపు ఇరవై మంది మారణాయుధాలతో వారిపై దాడి చేశారు. హత్యకు గురైన వారు హనుమారెడ్డి హత్య కేసులోనూ, బాంబు తయారీ కేసులోనూ నిందితులని పోలీసు వర్గాలు చెప్పాయి.

ఈ సంఘటనతో దుర్గి పరిసర ప్రాంతాలు ఉద్రిక్తతతో ఊగిపోయాయి. పోలీసులు హుటాహుటిన జిల్లా కేంద్రం నుంచి అదనపు బలగాలను తరలించారు. మృతులు మాచర్ల తెలుగుదేశం ఎమ్మెల్ల్యే జూలకండి దుర్గాంబ ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X