వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐటితో సమర్థపాలన: ఉమ
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) ద్వారా ప్రజలకు సమర్ధమైన పరిపాలననుఅందివచ్చునని రాష్ట్ర గనుల శాఖా మంత్రి ఉమామాధవ రెడ్డిఅన్నారు. ఇ-గవర్నెన్స్పై శనివారం జరిగిన సదస్సులో ఆమెప్రసంగించారు. ప్రజలకు సేవలందించవచ్చుననేఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటికి ప్రాధాన్యంఇస్తోందని ఆమె చెప్పారు.
ప్రభుత్వం అన్ని శాఖల్లో ఐటిసౌకర్యం కల్పిస్తోందని, ఇదే సమయంలో ఐటివిద్యకు ప్రాధాన్యం ఇస్తోందని ఆమె అన్నారు. సమాచారం తగినసమయంలో తగిన వ్యక్తులకు అందాల్సినఅవసరం వున్నదని, అందుకు ఇంటర్నెట్ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉమామాధవరెడ్డి అభిప్రాయపడ్డారు.ప్రభుత్వోద్యోగులు ఐటిపై అవగాహన పెంచుకోవాలని ఆమెసూచించారు.
Comments
Story first published: Saturday, March 10, 2001, 23:53 [IST]