తాలిబన్ల చర్యపైయుఎన్ ఆగ్రహం
న్యూయార్క్: అఫ్ఘనిస్తాన్లోబుద్ధ విగ్రహాల విధ్వంసంపై ఐక్యరాజ్యసమితి(యుఎన్) సర్వసభ్య ప్రత్యేకసమావేశంలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకాయి. జర్మనీచొరవతో న్యూయార్క్లో ఈ సమావేశాలు ఏర్పాటయ్యాయి.దాదాపు అన్ని దేశాలు తాలిబన్ల చర్యపై నిప్పులుచెరిగాయి. బుద్ధ విగ్రహాల విధ్వంసాన్ని భారతరాయబారి కమలేష్ శర్మ తాలిబన్ల ఉన్మాద చర్యగా అభివర్ణించారు.
బుద్ధ విగ్రహాల విధ్వంసాన్ని జర్మనీ తీవ్రంగా వ్యతిరేకించింది.విజ్ఞానానికి, సహనానికి ముస్లింలు పెట్టిందిపేరని, ముస్లింలు ఎప్పుడూ ఇతర విగ్రహాలనుధ్వంసం చేయరని జర్మనీ ప్రతినిధి అన్నారు. ఇస్లాం స్ఫూర్తికిబుద్ధ విగ్రహాల విధ్వంసం విరుద్ధమనిఆయన అన్నారు.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోఫీఅన్నన్ ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనకు వెళ్తారువున్నారు. బుద్ధ విగ్రహాల విధ్వంసంపై ఆయన ఈసందర్భంగా అక్కడి తాలిబన్లతో మాట్లాడగలరని భావిస్తున్నారు.ఇదిలా వుండగా తాలిబన్లకు నచ్చజెప్పేందుకుపాకిస్థాన్ విదేశాంగ మంత్రి మొయినుద్దీన్హైదర్ తాలిబన్కు బయలుదేరి వెళ్లారు.