వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గృహ నిర్బంధంలో గిలానీ
శ్రీనగర్: హురియత్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు, జమాతే ఇస్లాం నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీని పోలీసులు ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచారు. శ్రీనగర్ నగరంలోని లోతట్టు ప్రాంతం నౌహట్టను ఆయన సందర్శించకుండా నిర్బంధించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతవారం ఆ ప్రాంతంలో బాంబు పేలుడు జరిగింది. ఆ ఘటనలో గాయపడ్డ వారిని, ఇళ్ళు కోల్పయిన వారిని పరామర్శించేందుకు ఆయన వెళ్ళాల్సి ఉంది.
అయితే అక్కడ ఓ ప్రదర్శన కూడా నిర్వహించాలని ఆయన సిద్ధమయ్యారని సమాచారంఅందడంతో పోలీసులు ఆయన సందర్శనను అడ్డుకున్నారు. పోలీసుల, crpf బృందం కలిసి ఆదివారం తెల్లవారుఝామున గిలానీ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటినుంచి ఆయన బయటికి వెళ్ళకుండా నిర్బంధించారు.
Comments
Story first published: Sunday, March 11, 2001, 23:53 [IST]