ఫైనల్లో తెలుగుతేజం గోపీచంద్
బర్మింగ్ హామ్: భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం గోపిచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూసుకెళ్ళాడు. పదోసీడ్ గా బరిలోకి దిగిన గోపీచంద్ అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ సెమీఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ పీటర్ గేడ్ పై సంచలన విజయం సాధించాడు. శనివారం ఉదయం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో డెన్మార్క్ కు చెందిన టాప్ సీడ్ ఆటగాడ్ పీటర్ గేడ్ పై 17-14, 17-15 స్కోర్ సాధించి టైటిల్ పోరులో నిలిచాడు. 1980లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకున్న ప్రకాష్ పదుకొనే తర్వాత ఈ పోటీల్లో ఫైనల్ కు చేరుకున్న రెండో భారతీయుడు పుల్లెల గోపీచంద్.
సుదినం : పదుకొనే
ఈ
రోజు
భారత
బ్యాడ్మింటన్
కు
సుదినం
అని
ఈ
వార్త
విన్నవెంటనే
ప్రకాష్
పదుకొనే
ఆనందంతో
అన్నారు.
ఆత్మవిశ్వాసంతో
మరో
ఒక
రోజు
ఆడితే
చాలు
దేశ
ప్రతిష్ట
ఇనుమడించనవాడు
అవుతాడని
ఆయన
పేర్కొన్నారు.
ఫైనల్లో
కూడా
గెలిచే
సత్తా
గోపీచంద్
కు
ఉందని
ఆయన
ఆత్మవిశ్వాసం
వ్యక్తం
చేశారు.