జయలలిత అబద్దాలకోరు: కరుణానిధి
మధురై: తమిళమానిల కాంగ్రెస్ అన్నాడిఎంకె తో పొత్తుపెట్టుకోవడం వల్ల మాకు వచ్చే నష్టమేమి లేదని డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. మళ్ళీ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని కరుణానిధి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మధురై వచ్చిన కరుణానిధివిలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని ఆయన అన్నారు. జయలలిత మైనార్టీలను మోసపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనివిమర్శించారు.
ఏఐడిఎంకె సెక్యులర్ పార్టీ అని చెప్పుకోవడం అంత అబద్దం మరోటి ఉండదని ఆయన అన్నారు. జయలలిత ఎన్ని గిమ్మిక్కులు చేసిన ఆమెను ప్రజలు నమ్మరని కరుణానిధి విరుచుకుపడ్డారు. ఎన్డీఏ పార్టీల మధ్యసీట్ల అవగహన విషయంపై వ్యాఖ్యానిస్తూ- అన్ని సక్రమంగానే జరుగుతాయని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినన్ని స్థానాల్లో డిఎంకె పోటీ చేస్తుందని తెలిపారు.