వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాతబస్తీ కలహాల వెనుక పాక్ హస్తం
గుంటూరు: హైదరబాద్ లోని పాతబస్తీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న మతపరమైన కలహాల వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు బిజెపి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో అలజడి సృష్టించేందుకే పాక్ ఈ పన్నాగాల్ని పన్నుతోందని ఆయన ఆదివారం గుంటూరులో అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అలాగే త్వరలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని పార్టీలే విజయకేతనం ఎగురవేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో జయలలితతో కాంగ్రెస్, టిఎంసిలు చేతులు కలపడాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 15 సీట్లకు సంతృప్తి పడాల్సి వచ్చిందంటే ఆ పార్టీ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని బంగారు లక్ష్మణ్ అన్నారు.
Comments
Story first published: Sunday, March 11, 2001, 23:53 [IST]