వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాతబస్తీ కలహాల వెనుక పాక్‌ హస్తం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: హైదరబాద్‌ లోని పాతబస్తీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న మతపరమైన కలహాల వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉన్నట్లు బిజెపి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో అలజడి సృష్టించేందుకే పాక్‌ ఈ పన్నాగాల్ని పన్నుతోందని ఆయన ఆదివారం గుంటూరులో అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అలాగే త్వరలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని పార్టీలే విజయకేతనం ఎగురవేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో జయలలితతో కాంగ్రెస్‌, టిఎంసిలు చేతులు కలపడాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ 15 సీట్లకు సంతృప్తి పడాల్సి వచ్చిందంటే ఆ పార్టీ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని బంగారు లక్ష్మణ్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X