గోపీచంద్కు రూ.25 లక్షలఅవార్డు
హైదరాబాద్: ఆల్ ఇంగ్లాండ్బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెల్చుకున్న పుల్లెలగోపీచంద్కు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలరూపాయల నగదు బహుమతిప్రకటించింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెల్చుకుని రాష్ట్ర పేరు ప్రతిష్టలనుగోపీచంద్ ఇనుమడింపజేశారని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు సోమవారం శాసనసభలోఅన్నారు. నగదు బహుమతితో గోపీచంద్ కోరుకున్నచోట అతనికి ఇంటి స్థలం కూడా ఇస్తామని ఆయనచెప్పారు.
రాష్ట్రంలో బ్యాడ్మింటన్ శిక్షణకుఅవసరమైన సదుపాయాలు లేక గోపీచంద్ కర్ణాటక రాష్ట్రంవెళ్లి ప్రాక్టిస్ చేయడాన్ని ఆయన గుర్తు చేస్తూ ఇకముందు అటువంటి పరిస్థితులు రాకుండారాష్ట్రంలో బ్యాడ్మింటన్ శిక్షణకు ఒక అకాడమీని ఏర్పాటు చేస్తామనిఆయన చెప్పారు. ఈ అకాడమీ ఏర్పాటు గురించిగోపీచంద్తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రిచెప్పారు. గోపీచంద్ను అభనందిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానంఆమోదించింది.
గత 17 ఏళ్ల కాలంలో ఐదేళ్లుమినహా మిగతా 12 ఏళ్లు రాష్ట్రంలోతెలుగుదేశం పార్టీయే అధికారంలో వున్నదని,బ్యాడ్మింటన్ ప్రాక్టిస్కు రాష్ట్రంలో తగినసదుపాయాలు కల్పించకపోవడం సిగ్గు చేటని ప్రతిపక్షనాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅన్నారు. తగిన సౌకర్యాలు లేక గోపీచంద్ కర్ణాటక రాష్ట్రంవెళ్లి ప్రాక్టీస్ చేశాడని, ఇక ముందు ఇటువంటి పరిస్థితులుఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతప్రభుత్వంపై ఉన్నదని ఆయన అన్నారు.
- గోపీచంద్ విజయ బావుటా
- గోపిచంద్కు పార్లమెంట్ ప్రశంస