రేషన్ కార్డుల ప్రింటింగ్ లో గోల్ మాల్
హైదరాబాద్ః జంటనగరాల ప్రజలకు ఇచ్చే రేషన్ కార్డుల ముద్రణవిషయంలో భారీ ఎత్తున గోల్ మాల్ జరిగిందని సోమవారంఅసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ వుండగా ఒక ప్రైవేట్ ప్రింటర్ కు కీలకమైన రేషన్ కార్డుల ముద్రణ బాధ్యత అప్పగించడానికి కారణం ఏమిటని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి.
ప్రతిపక్షాల ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మౌనం వహించారు. జంటనగరాలలోఅర్హలైన వారందరికీ త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి హామీఇచ్చారు. వచ్చే జన్మభూమి లోగా రేషన్ కార్డులు పొందేందుకుఅర్హులైన వారందరినీ గుర్తించే కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈఅంశంపై కాంగ్రెస్, బిజెపి, ఎం.ఐ.ఎం. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానంగా పైవిషయం చెప్పారు.
రేషన్ కార్డుల ముద్రణ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కు కాకుండా ఒక ప్రైవేట్ ప్రెస్ కు ఇవ్వడంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్ల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ వుండగా ప్రసాద్ ప్రింటర్స్ అనే ప్రైవేట్ ప్రింటర్ కు రేషన్ కార్డుల ముద్రణ బాధ్యతను అప్పగించడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.