వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోపిచంద్కు పార్లమెంట్ ప్రశంస
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తర్వాత ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ ను సాధించిన ఆంధ్ర బాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ను, ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించినస్పిన్నర్ హర్భజన్సింగ్ను భారత పార్లమెంట్ సోమవారం నాడు ప్రశంసలతో ముంచెత్తింది.
లోకసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఈ ఆటగాళ్ల అద్భత ప్రతిభాపాటవాలను ప్రధాని వాజ్పేయి ప్రస్తావించారు. వీరివల్ల భారతీయ క్రీడాజగత్తుకు కొత్తవెలుగులు వచ్చాయని ఆయన అన్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లను చూసి దేశం గర్విస్తున్నదని ఆయన చెప్పారు. ప్రధాని ప్రశంసలతో ప్రతిపక్షనేత సోనియాగాంధీ ఏకీభవించారు. గోపిచంద్, హర్భజన్సింగ్ను ఆమెఅభినందించారు.
- గోపీచంద్ విజయ బావుటా
-
గోపీచంద్కు
రూ.25
లక్షలఅవార్డు
Comments
Story first published: Monday, March 12, 2001, 23:53 [IST]