వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి ప్రభుత్వానికి చుక్కెదురు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాజ్‌పేయి సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి సోమవారం నాడు రాజ్యసభలో ఘోరపరాభవం ఎదురయింది. పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణను రాజ్యసభ 103-64 ఓట్ల తేడాతో విజయం సాధించింది.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ సభ్యడు ప్రణబ్‌ ముఖర్జీ ఈ సవరణను ప్రతిపాదించారు. బాల్కో వాటాను గత చరిత్ర ఏమాత్రం సజావుగా లేని స్టెరిలైట్‌ వంటి సంస్థకు విక్రయిస్తున్న విషయం రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనలేదని ప్రణబ్‌ముఖర్జీ పేర్కొన్నారు. ప్రణబ్‌ ప్రతిపాదించిన సవరణను అధికార కూటమి వ్యతిరేకించినప్పటికీ రాజ్యసభలో వారికి తగిన బలం లేకపోవడంతో పరాభవం ఎదుర్కోవల్సివచ్చింది.దీనివల్ల ప్రభుత్వ మనుగడకు నష్టం లేనప్పటికీ ప్రభుత్వం ఇలా పరాభవం పాలు కావడం మాత్రం అధికార పక్షానికి తలవంపులుగా చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X