బంగారు లక్ష్మణ్ రాజీనామా
న్యూఢిల్లీః ఒక వెబ్సైట్ వెలువరించిన కథనం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ లో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. రక్షణ శాఖ ఒప్పందాలలో అవినీతికి పాల్పడ్డ ఆరోపణలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిని బిజెపిసీనియర్ నాయకుడు బంగారు లక్ష్మణ్ మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో నిజం లేదని, ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రఅని బంగారు లక్ష్మణ్వివరించారు. అయితే ఆరోపణల దరిమిలా నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. లక్ష్మణ్ తో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, సమతా పార్టీ అధ్యక్షురాలు జయా జైట్లీ కూడా పదవుల నుంచి వైదొలగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ అవినీతి బాగోతం తో ఎన్డీఏ సర్కార్ పునాదులు కదిలిపోతున్నాయి. వాజ్పేయి సర్కార్ గద్దె దిగాల్సిందే అని ప్రతిపక్షాలు రణభేరిమోగించాయి.
- లక్ష్మణ్ స్థానంలో జానా కృష్ణమూర్తి!
- ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
- నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
- పెద్ద చేపలు చిక్కిన వైనం.......
- లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
- ఎన్డీఏ సర్కార్ వెన్నులో వణుకు
- కెమేరా కళ్ళున్నాయ్...ఖబడ్దార్
- రక్షణ
లావాదేవీల్లో
మామూళ్లు