అటల్కు మమత ఘాటు లేఖ
న్యూఢిల్లీ: తెహల్కా డాట్కామ్ బయట పెట్టిన రక్షణ శాఖ కుంభకోణంపై తృణమూల్కాంగ్రెస్ నేత, రైల్వే మంత్రి మమతా బెనర్జీ తీవ్రంగాప్రతిస్పందించారు. రక్షణ మంత్రి జార్జిపెర్నాండెజ్ రాజీనామాను ఆమోదించాలని ఆమె డిమాండ్చేశారు. ఈ కుంభకోణంపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఆమె ప్రధానిని డిమాండ్చేశారు. జార్జి ఫెర్నాండెజ్ చేత రాజీనామా చేయించకపోతేతాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆమెబెదిరించారు.
ఇదిలా వుంటే, జాతీయప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) భాగస్వామ్య పక్షాలుతెలుగుదేశం, ఎఐఎల్ఎన్డి రక్షణ శాఖ కుంభకోణంపై తీవ్రంగాప్రతిస్పందించాయి. ఈ కుంభకోణంపై సమగ్రదర్యాప్తు జరిపించాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడుసి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అయితే,ఎన్డిఎకు తమ మద్దతు ఉపసంహరించుకోబోమని ఈ రెండు పార్టీలు స్పష్టంచేశాయి. ఎన్డిఎ సమావేశం బుధవారం సాయంత్రంజరిగింది. ఈ సమావేశానికి మమతా బెనర్జీహాజరు కాలేదు. ఈ సమావేశంలో జార్జిఫెర్నాండెజ్ మౌనంగా వున్నారు. మమత బెనర్జీ ప్రధానికి రెండు లేఖలురాశారు. తెహల్కా డాట్కామ్ బయట పెట్టినఆంశాలపై స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ చేతదర్యాప్తు జరిపించాలని మొదట ప్రధానికి లేఖ రాసిన మమత ఆ తర్వాత జార్జిఫెర్నాండెజ్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ మరో లేఖరాశారు. జార్జి ఫెర్నాండెజ్ రాజీనామాను ఆమోదించాలనే మమతడిమాండ్ను ఎన్డిఎ సమావేశం తోసిపుచ్చింది.
తెహల్కా డాట్కామ్ బయటపెట్టిన విషయాల వ్యవహారం దేశంలోనిఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావంచూపబోదని బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బంగారు లక్ష్మణ్అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువుఅవుతాయని ఆయన అన్నారు. బిజెపి ఒక నిర్ణయాత్మక స్థితికి చేరుకుంటున్న తరుణంలో ప్రజలదృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ చేసిన కుట్రఇది అని ఆయన అన్నారు.
యూత్ కాంగ్రెస్కు చెందినవారుగా భావిస్తున్నకొందరు బుధవారం బిజెపి కార్యాలయంతో గందరగోళంసృష్టించారు. వారు బిజెపి కార్యాలయం చెంతకు చేరుకుని ఎన్డిఎప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘర్షణకుదిగారు. ఈ గందరగోళంలో ఒక ఫొటోగ్రాఫర్ గాయపడ్డాడు.