ప్రధాని రాజీనామాకువిపక్షం ఉడుంపట్టు Home Full Story
న్యూఢిల్లీః రక్షణ శాఖ వ్యవహారంలోతెహల్కా డాట్ కాం వెల్లడించిన అవినీతి బాగోతంబుధవారం లోక్ సభను స్తంభింపచేసింది. ప్రధాని వాజ్ పేయి, రక్షణ శాఖ మంత్రి జార్జిఫెర్నాండెజ్ రాజీనామా చేయాలనే ప్రతిపక్షాల డిమాండ్ తో పార్లమెంట్ ఉభయ సభలుదద్దరిల్లిపోయాయి. దీనితో ఉభయ సభలువాయిదా పడ్డాయి.
బుధవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై రణభేరిమోగించాయి. స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి తనస్థానంలో కూర్చోక ముందు నుంచే ప్రతిపక్ష సభ్యులు జట్లుగావచ్చి స్పీకర్ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. వాజ్ పేయి రాజీనామా చేయాలను డిమాండ్చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతకూ శాంతించకపోవడంతో సభనుమధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ వాయిదావేశారు.
రాజ్యసభలో కూడా ఇదేప్రహసనం కొనసాగింది. దీనితో సభను గురువారంనాటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కృష్ణకాంత్ప్రకటించారు. వాజ్ పేయి, ఫెర్నాండెజ్ రాజీనామా చేసేవరకు సభను అడుగు ముందుకు కదలనివ్వమంటూ ఆర్జేడీ, సిపిఎం పార్టీలు స్పష్టంచేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంగద్దెదిగడమే శరణ్యం అని ఆ పార్టీ స్పష్టంచేసింది.
- నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
- లక్ష్మణ్ స్థానంలో జానా కృష్ణమూర్తి!
- పెద్ద చేపలు చిక్కిన వైనం.......
- లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
- ఎన్డీఏ సర్కార్ వెన్నులో వణుకు
- కెమేరా కళ్ళున్నాయ్...ఖబడ్దార్
-
రక్షణ
లావాదేవీల్లో
మామూళ్లు