వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నలుగురురక్షణాధికారుల సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఒక వెబ్సైట్బయట పెట్టిన రక్షణ శాఖ కుంభకోణానికిసంబంధించి ప్రభుత్వం నలుగురు రక్షణ శాఖఅధికారులను సస్పెండ్ చేసింది. మేజర్ జనరల్పి.ఎస్.కె. చౌదరి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు స్టాఫ్ ఆఫీసర్హెచ్.సి. పంత్, రక్షణ మంత్రిత్వ శాఖలో సహాయ ఆర్థికసలహాదారు నరేంద్ర సింగ్, ఆర్మీ హెడ్క్వార్టర్లోఅసిస్టెంట్ పి. శశి సస్పెన్షన్కు గురయ్యారు.
తెహల్కా డాట్కామ్ కుంభకోణాన్నిబయట పెట్టిన నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తు జరిపి ఆనలుగురిని సస్పెండ్ చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖఅధికార ప్రతినిధి చెప్పారు. తెహల్కాడాట్కామ్ తీసిన వీడియో టేప్ల్లో ఈ నలుగురు ప్రముఖంగాకనిపించారు. మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయిసమావేశంలో ఈ నలుగురిని సస్పెండ్ చేయాలనినిర్ణయం తీసుకున్నారు.
Comments
Story first published: Wednesday, March 14, 2001, 23:53 [IST]