బాబు ఆస్తుల మాటేమిటి?:వైయస్
హైదరాబాద్: తెహల్కాడాట్కామ్ వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుఆస్తులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలనికాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్టర్వై.యస్. రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. రక్షణ కుంభకోణంవెల్లడయిన నేపథ్యంలో ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలో ఆయన ఈ డిమాండ్చేశారు. తన ఆస్తుల వివరాలను వెల్లడించినప్పుడుతెహల్కా డాట్కామ్ విశ్వసనీయతను ప్రశ్నించినచంద్రబాబునాయుడు రక్షణ కుంభకోణంపైవిచారణ జరగాలంటున్నారని ఆయన గుర్తుచేశారు.
ఈ స్థితిలో చంద్రబాబుఆస్తులపై విచారణ జరగాల్సిందేనని ఆయన అన్నారు.చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్ల మీద, బినామీపేర్ల మీద వున్న రెండు వేల కోట్ల రూపాయలవిలువ చేసే ఆస్తులు చంద్రబాబుకున్నట్లుతెహల్కా డాట్కామ్ బయట పెట్టిందని, వీటినిగ్గు తేలాల్సిందేనని రాజశేఖరరెడ్డి అన్నారు. రక్షణ కుంభకోణానికి బాధ్యతవహించి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామాచేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా వుంటే, రక్షణ కుంభకోణంపైవిజయవాడలో కాంగ్రెస్, వామపక్షాలు వేర్వేరుగాప్రదర్శనలు నిర్వహించాయి. ప్రధాని వాజ్పేయి రాజీనామాచేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్డిఎ సర్కార్కుమద్దతు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేసింది.