కోఫీ అన్నన్తో అఖిలపక్ష సమావేశం Home Full Story
న్యూఢిల్లీ : భారత్లో మూడు రోజుల పాటు పర్యటించేందుకు వచ్చిన కోఫీ అన్నన్ శుక్రవారం నాడు పార్లమెంట్ సమావేశాలను స్వయంగా తిలకించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. అయితే రక్షణ శాఖలో ముడుపుల బాగోతంపై సభలో గత మూడు రోజులుగా సాగుతున్న రభస కారణంగా అన్నన్ సభా కార్యక్రమాలను తిలకించే అవకాశం వుండకపోవచ్చునని అంటున్నారు.
అన్నన్ కోరికను తెలియజేసి అన్ని పార్టీల సహకారం తీసుకునేందుకు లోకసభ స్పీకర్ బాలయోగి గురువారం నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఈ విషయంలో తమ అశక్తతను వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. తమమట్టుకు తాము గొడవచేయకుండా సహకరించడానికి సిద్ధంగా వున్నామని వారు స్పీకర్కు తెలిపారు.
మిగిలిన
సభ్యులను
అదుపుచేయడం
మాత్రం
తమవల్ల
కాదని
వారు
వెల్లడించినట్టుగా
తెలిసింది.
దానితో
స్పీకర్
బాలయోగి
పార్లమెంట్
ఉభయ
సభల్లోని
వివిధ
పార్టీల
నేతలతో
తమ
చాంబర్లోనే
కోఫీ
అన్నన్
కోసం
ప్రత్యేక
సమావేశం
ఏర్పాటు
చేయాలని
నిర్ణయించారు.