అసెంబ్లీలోనూ రక్షణ కొనుగోళ్ల ప్రకంపనలు
హైదరాబాద్: దేశ రక్షణ శాఖ కుంభకోణం గురువారం రాష్ట్ర శాసనసభను కూడాకుదిపేసింది. తెహెల్కా డాట్కామ్ బయట పెట్టిన కుంభకోణంపై శాసనసభలోచర్చ జరగాలని కాంగ్రెస్ సభ్యులుపట్టుబట్టారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగావారు శాసనసభలో ప్లేకార్డులను ప్రదర్శించారు.తెహెల్కా డాట్కామ్ బయటపెట్టిన ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ఆస్తుల వివరాలపై విచారణజరగాల్సిందేనని ప్రతిపక్ష నేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డిఅన్నారు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా బిజెపి కూడాప్లేకార్డులను ప్రదర్శించింది. కాంగ్రెస్ సభ కార్యక్రమాలకు అడ్డు తగలవద్దని,సత్సంప్రదాయాల గురించి ఆలోచించాలని శాసనసభవ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చేసినవిజ్ఞప్తిని కాంగ్రెస్ పట్టించుకోలేదు. రక్షణ శాఖ కొనుగోళ్లవ్యవహారం రుజువులతో సహా బహిర్గతమైందని,వేరే నిరూపణలు అవసరం లేదని రాజశేఖరరెడ్డిఅన్నారు. చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతోకాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతోస్పీకర్ కె. ప్రతిభా భారతి కాసేపు సభను వాయిదావేశారు.