రక్షణ మంత్రి జార్జ్ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. రక్షణ శాఖ లావాదేవీల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటున్న విషయం సాక్ష్యాలతో సహాతెహల్కాడాట్ కామ్ బయటపెట్టడంతో, రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టుగా జార్జ్ ప్రకటించారు.
తెహల్కా కథనం రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టించడంతో జార్జ్ రాజీనామాకు ఎన్డిఎ భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్ను ప్రధాని వాజ్పేయి తిరస్కరించారు. ప్రధాని తిరస్కారంతో అలిగిన మమతా బెనర్జీ ఎన్డిఎ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు.
మమతా
బెనర్జీ
ప్రకటన
వెలువడిన
కొన్ని
గంటల్లోనే
జార్జీ
రాజీనామా
నిర్ణయం
కూడా
వెలువడింది.
రక్షణ
మంత్రిగా
తాను
తన
విధులను
చిత్తశుద్ధితో,
నిజాయితీగా
నిర్వర్తించానని
జార్జ్
ప్రకటించారు.
విధి
నిర్వహణలో
ప్రధాని
ఇతర
సహచరులు
తనకెంతో
సహకరించారని
ఆయన
చెప్పారు.