వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంటు ఉభయ సభల స్తంభన
న్యూఢిల్లీ: తెహెల్కాడాట్కామ్ బయట పెట్టిన రక్షణ కొనుగోళ్లవ్యవహారం గురువారం కూడా పార్లమెంటు ఉభయసభల కార్యకలాపాలను స్తంభింపజేసింది. నైతిక బాధ్యతవహించి వాజ్పేయి ప్రభుత్వం రాజీనామాచేయాల్సిందేనని ప్రతిపక్షాలుపట్టుబట్టాయి. దేశ భద్రతను ఫణంగా పెట్టినవాజ్పేయి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేహక్కు ఏ మాత్రం లేదని ప్రతిపక్షాలు అన్నాయి. ప్రతిపక్షాలు ఇదేఅంశంపై బుధవారం పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేసినవిషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, రక్షణ మంత్రి జార్జిఫెర్నాండెజ్ రాజీనామా చేయాల్సిందేనని రైల్వే మంత్రి, తృణమూల్కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ పట్టుబట్టికూర్చున్నారు. ఆమెను బుజ్జగించడానికి ప్రధానివాజ్పేయి ప్రయత్నిస్తున్నారు. తనను కలవాల్సిందిగావాజ్పేయి మమతా బెనర్జీకి వర్తమానంపంపారు.
Comments
Story first published: Thursday, March 15, 2001, 23:53 [IST]