వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యంకొనుగోళ్లలో అవకతవకలు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బీవరేజెస్‌ కొనగోళ్లలో అవకతవకలుజరిగాయంటూ కాంగ్రెస్‌ గురువారం శాసనసభలోఆరోపించింది. అదనంగా డబ్బులు చెల్లించి మద్యంకొనగోళ్లు చేశారని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖరరెడ్డిఆరోపించారు. 304 నిబంధన కింద మద్యం కొనుగోళ్లవ్యవహారంపై చర్చ జరిగింది. అధిక మొత్తాలకుమద్యం కొనుగోళ్లు చేయడం వల్ల ఐదేళ్లలో రెండువేల కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ఖజానాకునష్టం వాటిల్లిందని రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ అవతవకలపై ప్రారంభించినవిజిలెన్స్‌ కమిషన్‌ దర్యాప్తును తొక్కి పట్టారనిఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై సిబిఐచేత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌చేశారు.

రాజశేఖరరెడ్డి ఆరోపణలను ఆబ్కారీ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు ఖండించారు. తమిళనాడులో మినహామిగతా రాష్ట్రాల్లో కన్నా తక్కువ ధరలకే మద్యాలను కొనుగోలు చేసినట్లుఆయన తెలిపారు. ఈ కొనుగోళ్లలో అవకతవకలేవీజరగలేదని, దాపరికం కూడా ఏమీ లేదని ఆయనఅన్నారు. ప్రభుత్వ ప్రాధాన్నాన్ని కాంగ్రెస్‌ వక్రీకరించేప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. మద్యంధరలు పెరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లుఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X