ఆపద్బాంధవుడు చంద్రబాబు!
న్యూఢిల్లీఃతెహల్కా సుడిగాలిలో చిక్కుకున్న ప్రధాన మంత్రివాజ్ పేయికి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నవైఖరే కాస్త ఊరట కలిగిస్తున్నది. వాజ్ పేయిసారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుఉపసంహరించుకొనే ప్రసక్తి లేదనితెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు శుక్రవారం స్పష్టంగా ప్రకటించారు. తమమద్దతుపై ఎటువంటి అనుమానాలు వద్దంటూ ప్రధానివాజ్ పేయికి ఆయన స్వయంగా భరోసా ఇచ్చి వచ్చారు.అటు మమత నిష్క్రమణ, జార్జి రాజీనామాతో అలిగి సమతా మంత్రులు,రాజీనామాలు, వారిని బుజ్జగించే పనులలో ఉక్కిరిబిక్కిరవుతున్నవాజ్ పేయికి తెలుగుదేశం నిజంగా ఎడారిలో ఒయాసిస్సులామారింది.
తెలుగుదేశం ఏ కేంద్ర మంత్రిని రాజీనామాచేయాలని కోరలేదని ఎర్రం నాయుడుచెప్పారు. తెహల్కా వ్యవహారంపై విచారణజరిపించి, నిజానిజాలు వెలికి తీయాలనితెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కోరుతునే వున్నదనిఆయన చెప్పారు. రక్షణ శాఖ మంత్రి జార్జిఫెర్నాండెజ్ రాజీనామా తరువాత కూడా ప్రతిపక్ష పార్టీలు సొంతలాభం కోసం ఈవిషయాన్ని ఇంకా రాద్ధాంతం చేస్తున్నాయని ఎర్రంనాయుడు విమర్శించారు.
ఎప్పుడు వాజ్ పేయి ప్రభుత్వంసంక్షోభంలో చిక్కుకున్నా వెన్నుదన్నుగా వుండి ఎన్డీఏను ఆదుకొనే చంద్రబాబు మరో సారి వాజ్ పేయి పాలిటఆపద్బాంధవుడిగా మారాడు.
- మూడోరోజు స్తంభించిన పార్లమెంట్
- సంక్షోభంలో వాజ్పేయి సర్కార్
- రక్షణ మంత్రి జార్జ్ రాజీనామా
- బసు సారథ్యంలో లోక్మోర్చా
- కేంద్రానికి మమతా గుడ్ బై
- అసెంబ్లీలోనూ రక్షణ కొనుగోళ్ల ప్రకంపనలు
- లక్ష్మణ్ స్థానంలో జానా కృష్ణమూర్తి!
- ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
- నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
- పెద్ద చేపలు చిక్కిన వైనం.......
- లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
- ఎన్డీఏ సర్కార్ వెన్నులో వణుకు
- కెమేరా కళ్ళున్నాయ్...ఖబడ్దార్
-
రక్షణ
లావాదేవీల్లో
మామూళ్లు