వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడోరోజు స్తంభించిన పార్లమెంట్‌ Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీఃతెహల్కా డాట్‌ కాం వెల్లడించిన రక్షణ కుంభకోణంపై శుక్రవారం కూడా పార్లమెంటు ఉభయ సభలుస్తంభించిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం గద్దెదిగే వరకు పార్లమెంటును అడుగు ముందుకుకదలనివ్వబోమని ప్రతిపక్ష పార్టీలు స్పష్టంచేశాయి. శుక్రవారం ఉదయం లోక్‌ సభ ప్రారంభంకాగానే వాజ్‌ పేయి ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షలుపట్టుపట్టాయి. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసుకుంటావెల్‌ లోకి దూసుకువచ్చారు. స్పీకర్‌ పదేపదే చేసినవిజ్ఞప్తులను ప్రతిపక్షాలు పెడచెవిన పెట్టాయి. ప్రతిపక్షాలనినాదాలు, అధికార పక్షాల ప్రతిసవాళ్ళతో లోక్‌ సభదద్దరిల్లిపోయింది. పరిస్థితి ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో సభను సోమవారంవరకు వాయిదా వేస్తున్నట్లు లోక్‌ సభ్‌ స్పీకర్‌జి.ఎం.సి. బాలయోగి ప్రకటించారు.

రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితినెలకొంది. ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగే వరకుతాము వెనక్కు తగ్గమంటూ ప్రతిపక్షాలు నినదించాయి. రక్షణ మంత్రి రాజీనామా చేసినంతమాత్రాన తాము శాంతించమని వారు స్పష్టంచేశారు.

మండిపడ్డ ఎన్డీఏ నేతలుః
పార్లమెంటు ఉభయ సభలను ప్రతిపక్షాలు మూడు రోజులుగా స్తంభింపచేయడాన్ని ఎన్డీఏ నేతలు తీవ్రంగా దుయ్యబట్టారు. నైతికవిలువలు గల జార్జి ఫెర్నాండెజ్‌ మంత్రి పదవికి రాజీనామాచేశారని, అయినా ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని భూతద్దంనుంచి ప్రజలకు చూపాలని ప్రయత్నిస్తున్నాయనికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వేల కోట్లరూపాయల కుంభకోణాలు జరిగాయని, అయినా ఏ ఒక్క మంత్రీ రాజీనామాచేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దెదిగలేదు. ఇప్పడు ఎన్డీఏ సర్కా గద్దె దిగాలని ఎలాఅడుగుతారని ఆయన సవాల్‌ విసిరారు. ఎన్డీఏలో చీలకవస్తే ప్రభుత్వం పతనం కావడం ఖాయం అనికాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నది.

తెహల్కా రేపిన చిచ్చును తమకుఅనుకూలంగా మలచుకోవాలని, ప్రభుత్వంపై మరింత ఒత్తడి తీసుకురావాలనికాంగ్రెస్‌, వామపక్షాలు, సమాజ్‌ వాది పార్టీల వ్యూహంగాకనిపిస్తున్నది. ప్రభుత్వాన్ని ఎంత ఎండగడితే అది తృతీయ ఫ్రంట్‌ కు అంతఅనుకూలంగా మారుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

  • ఆపద్బాంధవుడు చంద్రబాబు!
  • సంక్షోభంలో వాజ్‌పేయి సర్కార్‌
  • రక్షణ మంత్రి జార్జ్‌ రాజీనామా
  • బసు సారథ్యంలో లోక్‌మోర్చా
  • కేంద్రానికి మమతా గుడ్‌ బై
  • అసెంబ్లీలోనూ రక్షణ కొనుగోళ్ల ప్రకంపనలు
  • లక్ష్మణ్‌ స్థానంలో జానా కృష్ణమూర్తి!
  • ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
  • నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
  • పెద్ద చేపలు చిక్కిన వైనం.......
  • లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
  • ఎన్డీఏ సర్కార్‌ వెన్నులో వణుకు
  • కెమేరా కళ్ళున్నాయ్‌...ఖబడ్దార్‌
  • రక్షణ లావాదేవీల్లో మామూళ్లు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X