లక్ష్మణ్ను తప్పుపట్టిన ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ: రక్షణ శాఖ లావాదేవీల కుంభకోణంతో సంబంధం వుందని ఆరోపణలు వచ్చిన బీజేపీమాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ను ఆర్ఎస్ఎస్ తీవ్రంగా విమర్శించింది. శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన సంఘ్ కీలక సమావేశంలో వాజ్పేయి ప్రభుత్వాన్ని మాత్రం గట్టిగా సమర్ధించారు.
తహల్కా టేపుల్లో ఎక్కడా ప్రధాని ఊసులేదని అందువల్ల ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. వాజ్పేయి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబడుతునే మరో వైపు ఆయన్ను ఆర్ఎస్ఎస్ సమర్థించడం విశేషం. ఆర్ఎస్ఎస్ ట్రస్టీగా చెప్పుకున్న గుప్తాకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్ఎస్ఎస్లో ట్రస్టీలు ఎవరూ వుండరని సంఘ్ నేత మోహన్భగత్ చెప్పారు.
రక్షణ
శాఖలోని
అవినీతి
బాగోతంపై
సమగ్ర
విచారణ
జరిపించాలని
ఆయన
కోరారు.
లక్ష్మణ్
సంఘ్
సభ్యుడైనప్పటికీ
తప్పుచేసిన
వారిని
శిక్షించే
పద్దతి
ఆర్ఎస్ఎస్లో
లేదని
ఈ
విషయమేదో
బీజేపీనే
చూసుకోవాలని
ఆయన
స్పష్టం
చేశారు.