తెహల్కా రిపోర్టర్ కుకేంద్రం నోటీసులు
న్యూఢిల్లీః కేంద్ర హోంశాఖపై చేసిన ఆరోపణలను తెహల్కా వెనక్కు తీసుకోవాలంటూ ఆ డాట్ కాం రిపోర్టర్ కుకేంద్రం నోటీసులు జారీ చేసింది. కేంద్రహోం శాఖపై తెహల్కా రిపోర్టర్ మాథ్యూస్తీవ్రమైన ఆరోపణలు చేసి సంచలనంసృష్టించారు. కేంద్ర హోం శాఖలో సరిహద్దు భద్రతావ్యవహారాలలో భారీగా ముడుపులు ముట్టాయనిమ్యాథ్యూస్ ఆరోపించిన విషయం విదితమే. ఈవ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఈ ఆరోపణలను ఉపసంహరించుకోవాలనిలేకుంటే కోర్టు విచారణను ఎదుర్కోవాలనితెహల్కా రిపోర్టర్ మ్యాథ్యూస్ కు కేంద్రంనోటీసులు ఇచ్చింది.
తెహల్కా డాట్ కాం ఎన్డీఏ సర్కార్ పైపేల్చిన బాంబుతో దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తినవిషయం విదితమే. అంతటితో ఆగకుండా రక్షణ శాఖ తో పాటుకేంద్ర హోం శాఖ కూడా అవినీతి ఊబిలోకూరుకుపోయిందని తెహల్కా రిపోర్టర్ మ్యాథ్యూస్ సంచలనాత్మక ఆరోపణలుచేశారు. తెహల్కా వీడియో బాగోతం పార్ట్ - 2హోం శాఖ గురించి వుంటుందని అంతా అనుకున్నారు. అయితేమ్యాథ్యూస్ చేసిన ఆరోపణలను తెహల్కాఎడిటర్ తేజ్ పాల్ కూడా వ్యతిరేకించారని తెలిసింది.హోం శాఖ గురించి చేసిన ఆరోపణల పట్లమాధ్యూ సామ్యూల్, తేజా పాల్ మధ్య చిచ్చు రగిలినట్లు చెబుతున్నారు.
- ఆపద్బాంధవుడు చంద్రబాబు!
- సంక్షోభంలో వాజ్పేయి సర్కార్
- రక్షణ మంత్రి జార్జ్ రాజీనామా
- బసు సారథ్యంలో లోక్మోర్చా
- కేంద్రానికి మమతా గుడ్ బై
- అసెంబ్లీలోనూ రక్షణ కొనుగోళ్ల ప్రకంపనలు
- లక్ష్మణ్ స్థానంలో జానా కృష్ణమూర్తి!
- ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
- నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
- పెద్ద చేపలు చిక్కిన వైనం.......
- లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
- ఎన్డీఏ సర్కార్ వెన్నులో వణుకు
- కెమేరా కళ్ళున్నాయ్...ఖబడ్దార్
- రక్షణ లావాదేవీల్లో మామూళ్లు