వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రీడల అభివృద్ధికి ఊతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త క్రీడా విధానం ప్రకారం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మౌలిక వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి ఊళ్లో ప్రతి స్కూల్లో క్రీడల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ప్రతిష్టాత్మకమైన ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుని స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు శుక్రవారం నాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. లాల్‌బహుదుర్‌ స్టేడియంలో వైభవంగా జరిగిన సన్మాన కార్యక్రమానికి ప్రభుత్వాధినేతలతో పాటు ప్రతిపక్షనాయకులు కూడా హాజరయ్యారు. సభలో ప్రసంగించిన వక్తలంతా గోపీచంద్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

ఆల్‌ఇంగ్లాండ్‌ టైటిల్‌తో భారత కీర్తపతాకాన్ని సమున్నతంగా ఎగరవేసిన గోపీచంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ సన్మాన సభలో 25 లక్షల రూపాయల నగదు బహుమానాన్ని అందజేసింది. దానితో పాటు మరో 50 లక్షల రూపాయల విలువజేసే ఇంటిస్థలానికి సంబంధించిన పత్రాలను కూడా అందజేసింది.

ఈ సన్మానానికి ఉచితరీతిన సమాధానం ఇచ్చిన గోపిచంద్‌ సరైన ప్రోత్సాహం వుంటే రాష్ట్రంనుంచి అద్బుతమైనా ఆటగాళ్లు అనేక మంది వస్తారని చెప్పారు. ప్రస్తుతం తన తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్‌ అని చెప్పారు. దీనిని సాధించిన తర్వాత తాను రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌ అకాడెమీ ఏర్పాటు చేసి వర్ధమాన క్రీడాకారులకు తర్ఫీదు ఇస్తానని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X