సమత మంత్రులమంకుపట్టు
న్యూఢిల్లీ:తహల్కాడాట్కామ్ బయట పెట్టిన రక్షణవ్యవహారాల్లోని అవినీతి బాగోతం దరిమిలా రక్షణ మంత్రిజార్జ్ఫెర్నాండెజ్ తన పదవికి రాజీనామాచేయడంతో ఆయన బాటలోనే తమ పదవులకు రాజీనామా చేసినమరో ముగ్గురు సమతా పార్టీ మంత్రులు తమ రాజీనామావిషయంలో గట్టి పట్టుదలతో వున్నారు. జార్జ్ రాజీనామానుఆమోదించిన ప్రధాని వాజ్పేయి ఈ ముగ్గురు సమత మంత్రుల రాజీనామాను మాత్రం తిరస్కరించారు.
అయితే రాజీనామాల విషయంలోతాము వెనక్కి తగ్గేది లేదని సమతాపార్టీసీనియర్ నాయకుడు నితిష్ కుమార్ స్పష్టంచేశారు. జార్జ్ ఫెర్నాండెజ్ స్వయంగా నచ్చచెప్పడానికిప్రయత్నించినప్పటికీ తాము వినదల్చుకోలేదనిఆయన చెప్పారు. తమ పార్టీ అగ్రనేత జార్జ్ మంత్రిమండలిలో లేకుండా తాము మంత్రి పదవుల్లో ఎలా కొనసాగుతామనిఆయన ప్రశ్నించారు.
పాత
రాజీనామా
లేఖలను
ప్రధానితిరస్కరించినందున
మళ్లీ
కొత్త
రాజీనామా
లేఖలను
ప్రధానికి
సమర్పిస్తారా
అనిఅడుగగా,
అలాంటిదేమీ
లేదని
మొదట
ఇచ్చినలేఖకే
తాము
కట్టుబడి
వున్నామని
నితీష్
కుమార్
తెలిపారు.తాము
మంత్రి
పదవులకు
రాజీనామా
చేసినప్పటికీఎన్డిఎకు
తమ
మద్దతు
కొనసాగుతుందనిఆయన
స్పష్టం
చేశారు.