వాజ్ పేయీ ఇక గద్దెదిగుః సోనియా
బెంగుళూరుః కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని వాజ్పేయికి నైతిక విలువలపై ఏ మాత్రం గౌరవం వున్నా ఆయన తక్షణం గద్దె దిగాలని ఆమె డిమాండ్ చేశారు. శనివారం బెంగుళూరులో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ఆవేశంగా ప్రసంగించారు.
రక్షణ శాఖను వ్యాపారంగా మార్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆమె దుయ్యబట్టారు. సోనియా గాంధీ అనర్గళంగా హిందీలో ప్రసంగిస్తున్నంతసేపు ప్లీనరీ ప్రాంగణం అంతా సభ్యులు కరతాళ ధ్వనులతో మారుమోగి పోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం నరనరానా అవినీతి జీర్ణించుకుపోయిందని ఆమెవిమర్శించారు. ఇంత జరిగినా, వీడియో సాక్ష్యాలతో సహా అవినీతి బయటపడినా దోషులను కాపాడేందుకు వాజ్పేయి ప్రయత్నించడం ఆయన అధికార లాలసకు అద్దం పడుతున్నదని ఆమెవిమర్శించారు. వాజ్ పేయి ప్రభుత్వం దేశానికి నమ్మక ద్రోహం చేసిందని ఆమెదుయ్యబట్టారు.
ప్రధాని
వాజ్పేయి
జాతిని
తప్పుదారి
పట్టిస్తున్నారని
సోనియా
విమర్శించారు.
తహల్కా
బయటపెట్టిన
రక్షణ
శాఖ
వ్యవహారాల
కుంభకోణంపై
పార్లమెంట్లో
చర్చించడానికి
ప్రభుత్వం
సంసిద్ధత
వ్యక్తం
చేసినప్పటికీ
ఆమె
ఇందుకు
నిర్ద్వంద్వంగా
తిరస్కరించారు.
గతంలో
వివిధ
సమస్యలపై
బీజేపీ
దాని
మిత్రపక్షాలు
పార్లమెంట్ను
ఎలా
స్తంభింపజేసింది
ఆమె
ఈ
సందర్భంగా
గుర్తుచేశారు.
తన
భర్త,
మాజీ
ప్రధాని
రాజీవ్గాంధీ
హత్యను
గురించి
ప్రస్తావించినప్పుడు
ఆమె
తీవ్ర
భావోద్వేగానికి
లోనయ్యారు.
వేలాది
మందిని
బలి
తీసుకున్న
గుజరాత్
భూకంపం
కారణంగా
గత
ఫిబ్రవరీలోనే
జరగాల్సిన
ప్లీనరీ
మార్చికి
వాయిదా
పడిన
విషయం
కూడా
ఆమె
గుర్తు
చేశారు.