వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాన్పూర్ లో పెరిగిన ఉద్రిక్తత; కర్ఫ్యూ
కాన్పూర్: హింసాత్మక ఘటనలతో మూడు రోజులుగా అట్టుడుకుతున్న కాన్పూర్ లో మరో 5గురు మరణించారు. కర్ఫ్యూ విధించినప్పటికీ ఆదివారం కాన్పూర్ లో చేలరేగిన అలజడిలో 5గురు పౌరులు మరణించారు. దీంతో ఇప్పటివరకు శుక్రవారం నుంచి జరిగిన గొడవల్లో చనిపోయిన వారి సంఖ్య 14కి పెరిగింది. అయితే అనధికార వర్గాల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 20 వరకు ఉంటుందని అంటున్నారు. పవిత్ర ఖురాన్ ను ఢిల్లీలో ఒక సంస్థకు చెందిన కార్యకర్తలు కాలబెట్టారని వదంతులు వ్యాపించడంతో కాన్పూర్ లోని ముస్లిం విద్యార్థిసంస్థలు మార్చి 16న నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఐనప్పటికీ Student Islamic Movement of India కు చెందిన కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రార్థనాస్థలాల వద్ద హింసకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
Comments
Story first published: Sunday, March 18, 2001, 23:53 [IST]