వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైనిక కోర్టువిచారణ ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ శాఖ కొనుగోళ్ల వ్యవహారంలోని అవినీతిపై తహల్కా డాట్‌ కామ్‌ బయటపెట్టిన అంశాలపై విచారణకు సైన్యం ముగ్గురు సభ్యుల సైనిక కోర్టును నియమించింది. లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎస్‌కె జైన్‌ సారథ్యంలోని ఈ కోర్టు రహస్య విచారణ సోమవారం నుంచి ప్రారంభమయింది. జైన్‌ కాకుండా ఈ సైనిక కోర్టులో మేజర్‌ జనరల్‌ మోహిందర్‌పురి, మేజర్‌ జనరల్‌ ఎం మాథ్యూ వున్నారు. సైనిక దళాల ప్రధాన కార్యాలయంలో ఈ విచారణను నిర్వహిస్తున్నారు.తహల్కా బయటపెట్టిన కుంభకోణం రాజకీయ రంగంలో పెను సంక్షోభాన్ని సృష్టించి అధికార పార్టీ పీఠాన్ని కదిలిస్తున్న విషయం విదితమే.

మొదట తహల్కా డాట్‌ కామ్‌ వద్ద వున్న టేపులను తీసుకుని పరిశీలించాల్సి వున్నదని సైనికకోర్టు వర్గాలు చెప్పాయి. ఈ మేరకు తహల్కాకు సైనిక ప్రధాన కార్యాలయం లేఖ రాసే అవకాశం వుంది. ఈ టేపులను పరిశీలించిన తర్వాత సైనిక కోర్టు ఆరోపణలను ఎదుర్కుంటున్న అయిదుగురు అధికారులను విచారిస్తారు.
ఇదిలా వుండగా జార్జ్‌ ఫెర్నాండెజ్‌ రాజీనామా దరిమిలా రక్షణ శాఖ అదనపు బాధ్యతలను స్వీకరించిన విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్‌ సోమవారం నాడు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. త్రివిధ దళాధిపతులు మర్యాద పూర్వకంగా ఆయన్ను కలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X