వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
s
న్యూఢిల్లీ: తహల్కా బయటపెట్టిన రక్షణ శాఖ కుంభకోణంపై విచారణకు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించడం సాధ్యం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాసినట్టుగా తెలిసింది.
తహల్కా వంటి వ్యవహారంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నట్టుగా తెలిసింది. తమ సహచర న్యాయమూర్తులతో సంప్రదించిన తర్వాతనే ఆయన ఈ లేఖను రాసినట్టుగా తెలిసింది.
సుప్రీం
కోర్టున్యాయమూర్తులందరూ
సిట్టింగ్
జడ్జిని
కేటాయించడం
సాధ్యం
కాదని
అభిప్రాయపడ్డారని
తెలిసింది.
పదవివిరమణ
చేసిన
న్యాయమూర్తిని
విచారణకు
నియమించాలని
ప్రభుత్వం
భావిస్తే
న్యాయమూర్తినియామకంలో
సహకరించడానికి
సిద్ధంగా
వున్నట్టుగా
కూడా
ప్రధాన
న్యాయమూర్తి
ప్రభుత్వానికి
తెలిపినట్టుగా
ప్రభుత్వ
వర్గాలు
చెప్పాయి
Comments
Story first published: Monday, March 19, 2001, 23:53 [IST]