విహెచ్పి నేతప్రసంగంపై దుమారం
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోనిచాంద్రాయణగుట్ట ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నేత ఒకరురెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే మజ్లీస్ఆరోపణపై సోమవారం కొద్ది సేపు శాసనసభలోవివాదం చెలరేగింది. పాతబస్తీలో సభలు, సమావేశాలునిర్వహించడాన్ని పోలీసులు నిషేధించారని, ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించివిహెచ్పి నేత సభలు నిర్వహంచడమే కాకుండాముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనిమజ్లీస్ పక్ష నాయకుడు అసదుద్దీన్ ఓవైసీఅన్నారు.
విహెచ్పి నేతపైచర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనిఆయన విమర్శించారు. విహెచ్పి నేతను అరెస్టు చేసిఆయనపై కేసు ఎందుకు పెట్టలేదని ఓవైసీప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి సంతృప్తిచెందని మజ్లీస్ సభ్యులు ఒకానొక సందర్భంలోస్పీకర్ పోడియం దూసుకెళ్లారు. ఆ తర్వాత హోంమంత్రిటి.దేవేందర్ గౌడ్ ఇచ్చిన హామీతో వారు సంతృప్తిచెందడంతో సభ సద్దుమణిగింది.