వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలపరీక్షకుకాంగ్రెస్‌ సిద్ధమేనా?: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

రావత్‌భట్టా (రాజస్థాన్‌) :కాంగ్రెస్‌ పార్టీకి చైతనైతే తనబలమేమిటో పార్లమెంటులో నిరూపించుకోవాలని ప్రధానివాజ్‌పేయి సవాల్‌ విసిరారు. ప్రభుత్వం రాజీనామాచేయాలని కాంగ్రెస్‌ చేస్తున్న డిమాండ్‌నుఆయన తిరస్కరించారు. లోక్‌సభలో తగిన బలం లేనికాంగ్రెస్‌ అనర్థమైన ఆరోపణలు చేస్తోందని, ప్రభుత్వం రాజీనామా చేయాలని పార్లమెంటువెలుపల డిమాండ్‌ చేస్తోందని ఆయన అన్నారు.

ఆయన ఆదివారం నాడు బిజెపి కార్యకర్తల ర్యాలీనివుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వాలను కూల్చే సంస్కృతికాంగ్రెస్‌ పార్టీది అని, అధికారం కోసం అది ఇతరపార్టీలతో జత కడుతోందని, బీహార్‌లో అదేజరిగిందని ఆయన దుయ్యబట్టారు. తెహెల్కాఆరోపణలపై విచారణ కావాలని మొదట డిమాండ్‌ చేసినకాంగ్రెస్‌ ఇప్పుడు మాట మార్చిందని ఆయన అన్నారు.

25న ర్యాలీ

న్యూఢిల్లీ: తెహెల్కాటేప్‌ల విడుదల నేపథ్యంలో ప్రభుత్వంపైవిపక్షాలు చేస్తున్న విమర్శలను, దాడినితిప్పికొట్టేందుకు జాతీయ స్థాయిలో ప్రచారోద్యమంనిర్వహించాలని ఎన్‌డిఎ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 25న ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈర్యాలీలో ప్రధాని వాజ్‌పేయి, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలనాయకులు ప్రసంగిస్తారు. ప్రధాని వాజ్‌పేయి, హోంమంత్రి ఎల్‌కెఅద్వానీలతో సమావేశమైన తర్వాత ఎన్‌డిఎకన్వీనర్‌ జార్జి ఫెర్నాండెజ్‌ ఈ విషయంప్రకటించారు. రాష్ట్రాల రాజధానుల్లో, ముఖ్యపట్టణాల్లో సాగే ఈ ప్రచారోద్యమం ఏప్రిల్‌ 16వ తేదీవరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X