వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రపతిని కలిసిన జార్జ్
న్యూఢిల్లీ: ఎన్డిఎ కన్వీనర్, మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ మంగళవారం నాడు రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ను కలుసుకున్నారు. రక్షణ శాఖ లావాదేవీల్లో అవినీతికి సంబంధించి తహల్కా డాట్ కామ్ బయటపెట్టిన అంశాల, దరిమిలా ఉత్పన్నమైన పరిణామాలు, తన రాజీనామాకు దారితీసిన విషయాలపై ఆయన రాష్ట్రపతికి వివరణఇచ్చినట్టుగా తెలిసింది.
రాష్ట్రపతితో
జార్జ్
సమావేశం
సుమారు
30
నిమిషాల
పాటు
సాగింది.
రక్షణ
మంత్రి
పదవికి
రాజీనామా
చేసిన
తర్వాత
జార్జ్
రాష్ట్రపతిని
కలవడం
ఇదే
మొదటిసారి.
జార్జ్
రాజీనామాకు
ముందుగా
ప్రధాని
వాజ్పేయి
మాత్రం
రాష్ట్రపతిని
కలసి
పరిస్థితిని
వివరించారు.
Story first published: Tuesday, March 20, 2001, 23:53 [IST]