వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌డిఎ ప్రభుత్వంపై రాజీలేని పోరు

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ, దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్టుగా సిపిఐ జాతీయ నాయకుడు ఎబి బర్దన్‌ చెప్పారు. అఖిల భారత కిసాన్‌ సభ 26వ మహాసభల సందర్భంగా ఖమ్మంలో మంగళవారం నాడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభలో మాజీ ప్రధాని చంద్రశేఖర్‌, మాజీ కేంద్ర మంత్రి చతురానన్‌ మిశ్ర ప్రసంగించారు.

రక్షణ శాఖ అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్న ఎన్‌డిఎ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కులేదని బర్ధన్‌ అన్నారు. వాజ్‌పేయి తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు, సగటు ప్రజలకు వ్యతిరేకంగా వున్న విధానాలను అమలు చేస్తున్నాయని ఈ విధానాలపై పోరాటానికి ప్రజలు సమాయత్తం కావాలని చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. డబ్లుటివో ఒప్పందం దేశంలోని రైతుల ఆత్మహత్యలకు కారణభూతమని చతురానన్‌ మిశ్ర అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X